మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా సందడి మామూలుగా లేదు.పెద్ద ఎత్తున అభిమానులు ఆయన పుట్టిన రోజున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆయన పుట్టిన రోజున చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.సాదారణంగా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తేనే మరో రేంజ్ లో ఉంటుంది.
అలాంటిది ఆయన నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య నుండి మొదలుకుని లూసీఫర్ రీమేక్ మరియు వేదాళం రీమేక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ లు వచ్చేశాయి.
ముఖ్యంగా వేదాళం సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.లూసీఫర్ సినిమా లో చెల్లి పాత్రను నయనతార చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.కాని వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చెల్లి పాత్ర లో కనిపించబోతుంది.
అందుకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.కీర్తి సురేష్ నేడు రాఖీ పండుగ సందర్బంగా చెల్లి పాత్రకు సంబంధించిన వీడియోను రివీల్ చేశారు.
ఇప్పటి వరకు భోళా శంకర్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టలేదని అంతా అనుకుంటూ ఉన్నారు.అయితే ఈ వీడియోను రివీల్ చేయడంతో షూటింగ్ మొదలు అయ్యిందని యూనిట్ సభ్యులు క్లారిటీకి ఇచ్చినట్లయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ వేదాళం కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.సినిమా లో హీరోయిన్ తో పాటు చెల్లి పాత్ర కూడా చాలా కీలకం.
అందుకే ఈ పాత్రకు గాను కీర్తి సురేష్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.