ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రూరమైన విలన్ పాత్రల్లో నటిస్తూ జగపతి బాబు విజయాలను అందుకుంటున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రల ద్వారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల ద్వారా జగపతిబాబుకు విజయాలు దక్కుతున్నాయి.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన అంతఃపురం సినిమాలో జగపతిబాబు ముఖ్యపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఒక అమెరికన్ సినిమా ఆధారంగా కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.
అంతఃపురం సినిమాలో జగపతిబాబు సారాయివీర్రాజు పాత్ర చేయగా ఆ పాత్ర అతనికి మంచిపేరును తెచ్చిపెట్టింది.అయితే ఈ పాత్ర కోసం జగపతిబాబు తాగొచ్చి షూటింగ్ లో పాల్గొనడం గమనార్హం.
ఐదు రోజులు జగపతి బాబు మద్యం తాగి ఈ సినిమాలో యాక్ట్ చేశాడని తానే స్వయంగా జగపతిబాబుకు మందు ఇచ్చానని కృష్ణవంశీ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.ఈ సినిమాలోని పాత్రను అద్భుతంగా పోషించడంతో జగపతిబాబుకు నంది అవార్డు వచ్చింది.
తెలుగులో అంతఃపురం బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత తమిళంతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది.
ఈ సినిమా హిందీ రీమేక్ లో షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్ కలిసి నటించడం గమనార్హం.2003 సంవత్సరంలో శక్తి : ది పవర్ పేరుతో హిందీలో తెరకెక్కిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మరోవైపు కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఫలితాలను అందుకోవడం లేదు.
కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. రంగ మార్తాండ సక్సెస్ సాధిస్తే కృష్ణవంశీ కెరీర్ కు ప్లస్ అవుతుంది. రంగ మార్తాండ సినిమాతో కృష్ణవంశీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో చూడాల్సి ఉంది.