పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత కోరడం విడ్డూరం..: మంత్రి పొన్నం

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే( Mahatma Jyotirao Phule ) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) డిమాండ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) స్పందించారు.అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత కోరడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం అన్నారు.

 It Is Ironic That Kavitha Wants To Set Up A Statue Of Phule Minister Ponnam Deta-TeluguStop.com

బీఆర్ఎస్ పదేళ్లు పాలన కొనసాగించిందన్న ఆయన ఆ సమయంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు.

పూలే తమకు ఆదర్శమన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ కు ప్రజాభవన్( Praja Bhavan ) అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు.అయితే నిన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube