రాముడు వివాదం కాదు..సందేశం..: మోదీ

భారత్ అంతా రామనామంతో ఉర్రూతలూగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అన్నారు.రాముని ఆగమనంతో కాలచక్రంలో మళ్లీ శుభగడియలు వస్తాయని తెలిపారు.

 Ram Is Not A Controversy The Message Pm Modi Details, Pm Narendra Modi, Ayodhya-TeluguStop.com

ఇక భవిష్యత్ అంతా శుభదినాలేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు.అయోధ్య( Ayodhya ) ఘట్టం కోసం తాను పదకొండు రోజులు దీక్ష చేశానని చెప్పారు.

రాముడితో అనుబంధం ఉన్న అన్ని క్షేత్రాలను సందర్శించానన్నారు.

ఇవాళ దేశమంతా దీపావళి జరుపుకుంటోందని తెలిపారు.ఈ రాత్రికి ఇంటింటా దీపాలు వెలగాలని చెప్పారు.రామమందిరం( Ram Mandir ) భారత సమాజంలోని శాంతి, సామరస్యం పరస్పర అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.

రామమందిరం సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఆశాకిరణమని తెలిపారు.రాముడు వివాదం కాదని ఒక సందేశమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube