లండన్ లో స్థిరపడిన భారత సంతతి కి జంటకి 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.తాను బిలీనియర్ అవ్వాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడువుగా తన బుర్రకి పదును పెట్టాడు.చదవుతో పాటు ఆర్ధిక పరమైన విషయాలని తెలుసుకుంటూ పలు కంపెనీలకి అకౌంటెంట్ గా మారాడు.
ఇక అతడి స్పీడు మాములుగా లేదు.అతడు అనుకున్న బిలీనియర్ కలని నిజం చేసుకునేదుకు దూసుకు పోతున్నాడు
ఆ కుర్రాడి పేరు రణ్వీర్ సింగ్ సందు లండన్ లో పలు కంపెనీలకు అకౌంటెంట్, ఆర్థిక సలహాదారుగా పని సలహాలు ఇస్తున్నాడు.12 ఏళ్లకే తన మొదటి వ్యాపార సంస్థని ఏర్పాటు చేసిన అతడు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తూనే చదువుకుంటున్నాడు.ఇప్పటి వరకూ అతడికి బడా క్లైంట్స్ 10 మంది ఉన్నారు
కంపెనీలకి సలహాలు ఇవ్వడంలో అతడు దిట్ట, తలపండిన సీనియర్స్ కి అతడు ఓ సవాల్.
ఈ బాలుడు గంటకు ఒక్కొక్కరి వద్ద 12 నుంచి 15 పౌండ్లను గంటకి వసూలు చేస్తాడు.కేవలం 12 ఏండ్లకే బేసిక్ అకౌంటింగ్ సర్టిఫికెట్ సాధించిన ఇతదీ ప్రతిభని చూసి అతడి తల్లి తండ్రులు ఉబ్బి తబ్బిబవుతున్నారట.
ఇలానే దూసుకు పోతూ ఉంటే 25 ఏళ్ల లోపలే మిలినియర్ అవ్వడం ఖాయమని అంటున్నారు ఆర్ధిక నిపుణులు.