మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వచ్చాడు నాగ చైతన్య.అయితే చైతూకు థాంక్యూ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.
ఎంత అంటే నాగ చైతన్య పై వరుస నెగిటివ్ కామెంట్స్ సైతం వచ్చాయి.థాంక్యు సినిమా పెట్టిన బడ్జెట్ అంతా కూడా కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.
ఇక ఆ తర్వాత చైతూ బాలీవుడ్ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చడ్డా కూడా ఘోర పరాజయం పొందింది.ఇలాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత చైతూ నెక్స్ట్ సినిమాపై మరింత టెన్షన్ నెలకొంది.
ఈయన ప్రెజెంట్ చేస్తున్న బైలింగ్వన్ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నాడు.తమిళ్ డైరెక్టర్ తో చైతూ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
వెంకట్ ప్రభు తో నెక్స్ట్ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇది తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ సినిమాను చైతూ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించ బోతున్నారని సమాచారం.
సోలో హీరోగా చైతూ సినిమాలకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టనంత ఎక్కువ బడ్జెట్ ను ఈ సినిమా కోసం వెంకట్ ప్రభు కేటాయించారని టాక్ వినిపిస్తుంది.ఇది ఒక రకంగా రిస్క్ అయినప్పటికీ ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇందులో మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటించ బోతుంది.