ఏ ముహూర్తాన మన ప్రధాని మోడీ( Narendra Modi ) డిజిటల్ ఇండియన్ అని నినాదం అందుకున్నాడో గాని అప్పటినుండి భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విషయంలో దూసుకుపోతోంది.ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు.
కరోనా మహమ్మారి ఊపందుకుంటుండడంతో డిజిటల్ విధానం మరింత పెరిగింది.నేడు డిజిటల్ పేమెంట్లను అంగీకరించే అనేక ప్రదేశాలలో స్మార్ట్ స్పీకర్స్ పని చేస్తున్నాయి.
ఈ స్పీకర్లు పేమెంట్ చేసిన తర్వాత వాలెట్లోకి డబ్బు వచ్చినట్లు వాయిస్ వస్తుంది.
ఇది అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు మీ పేమెంట్ సక్సెస్ అయ్యాక పాపులర్ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) గొంతు వస్తే ఎలా వుంటుంది.వినడానికే క్రేజీగా వుంది కదూ.ఫోన్ పే( Phone pay ) మొట్ట మొదటి సెలబ్రిటీ వాయిస్ ఫంక్షన్ను తీసుకు రావడం విశేషం.మీరు ఫోన్ పే వాలెట్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు, స్మార్ట్ స్పీకర్లో మీ పేమెంట్ సక్సెస్ అయినట్లు అమితాబ్ బచ్చన్ వాయిస్ మీకు వినబడుతుంది.
ఈ ప్రముఖ సెలెబ్రిటీ గొంతును ఈ విధంగా ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఫోన్ పే మరిన్ని భాషల్లో ఈ సేవను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
అయితే ఇప్పుడు హిందీ ఇంకా ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉన్నందున దీనికి కొంత సమయం పట్టే వీలుంది. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్ సేవను కేవలం ఒక సంవత్సరం క్రితం ప్రవేశ పెట్టగా అది విజయవంతమైంది.భారతదేశంలోని 19,000 పోస్టల్ కోడ్లలో ప్రస్తుతం నాలుగు మిలియన్ల డివైజెస్ ని బిజినేస్ పార్టనర్స్ ఉపయోగిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.ఫోన్పే స్మార్ట్స్పీకర్లను సులభంగా క్యారీ చేయడం, రద్దీ ప్రదేశాలలో కూడా స్పష్టమైన ఆడియో ఇంకా చిన్న డిజైన్ తో ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయని కంపెనీ పేర్కొంది.