తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ రాజీకయ నేత ఏ విమర్శ చేసినా లేదంటే ఏ పార్టీ ఏ వ్యూహం పన్నినా అంతిమంతా అందరూ హుజూరాబాద్ టార్గెట్ గానే రాజకీయాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఇక్కడ ప్రచారంంలో బీజేపీ అలాగే టీఆర్ ఎస్ నువ్వా నేనా అన్నట్టు చేస్తున్నాయి.ఇక పోతే మొదటి నుంచి అన్ని పార్టీల నుంచి తమ పార్టీల్లోకి చేరికలు జరపుతూ పోటీ లేకుండా చూసుకుంటున్న టీఆర్ ఎస్ ఇందులో భాగంగా బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఈటల అనుచరులను చేర్చుకుంది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఏకంగా అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కౌశిక్ రెడ్డినే తమ పార్టీలో చేర్చుకుని పోటీ లేకుండా చూసుకుంది.ఇక పోతే కాంగ్రెస్లో ఇంకా ఎవరైనా బలమైన నేతలు ఉన్నారా అని వెతికి మరీ వారిని తమ పార్టీలో చేర్చుకుంటున్నారు మంత్రి హరీశ్ రావు.
ఇక ఇప్పటికే చాలామందిని చేర్చుకుని కాంగ్రెస్కు బలం లేకుండా చేసిన హరీశ్ రావు ఇప్పుడు రేవంత్ కు అండగా ఉంటున్న వారిని కూడా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు.ఇక ఇప్పడు జమ్మికుంట మండలంపై ఫోకస్ పెట్టారు హరీవ్ రావు.
ఇక జమ్మికుంటలో కాంగ్రెస్ లో మంచి లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న జగ్గయ్యపల్లి సర్పంచ్ కనపర్తి వంశీధర్ను తమ పార్టీలో చేర్చుకుని షాక్ ఇచ్చారు.అయితే ఈ వంశీధర్ మొదటి నుంచి కాంగ్రెస్లో రేవంత్కు నమ్మకస్తుడిగా మెలిగారు.మొన్న కౌశిక్రెడ్డి పార్టీ మారినా కూడా ఆయన మాత్రం మారకుండా పార్టీకోసం బాగా కష్టపడుతున్నారు.ఇక మండలంలో ఉన్న కాంగ్రెస్ సర్పంచులే చాలా తక్కువ.ఇప్పుడు ఉన్న ఒక్క పెద్ద లీడర్ను కూడా హరీశ్రావు చేర్చుకోవడంతో రేవంత్ కు భారీ షాక్ తగిలింది.ఇక ముందు ముందు ఇంకెంత మంది వెళ్తారో చూడాలి.