సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నలుగురు మెదక్ జిల్లాకు చెందిన వాళ్లే.

 Four Brs Mlas Met Cm Revanth Reddy At His Residence Details, Brs, Congress, Cm R-TeluguStop.com

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్),( Sunitha Laxmareddy ) కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక),( Kotha Prabhakar Reddy ) గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు),( Gudem Mahipal Reddy ) మాణిక్ రావు (జహీరాబాద్)( Manik Rao ) కలవడం జరిగింది.

ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.ఇదే సమయంలో తమ నియోజకవర్గాలలో సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మొన్నటి వరకు దావోస్( Davos ) పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి నేడే హైదరాబాద్ తిరిగి వచ్చారు.

దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని( BRS Party ) 100 మీటర్ల లోతుల పాతి పెడతామని అన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో 39 మంది ఎమ్మెల్యేలు 39 ముక్కలవుతారని వ్యాఖ్యానించారు.అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో ( Congress ) టచ్ లో ఉన్నారని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కావటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube