చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వెంకి అట్లూరి.ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా నాగ శౌర్య కెరియర్ లోనే పెద్ద హిట్ అని చెప్పాలి.
తాజాగా ఈ దర్శకుడు మళ్ళీ భీష్మతో నితిన్ కి నాలుగేళ్ల తర్వాత సాలిడ్ హిట్ ఇచ్చాడు.ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది.
ఈ సినిమా నిర్మాతలకి భీష్మ కాసులు కురిపిస్తుంది.వరుస రెండు హిట్ మూవీలతో మంచి జోష్ మీద ఉన్న వెంకి నెక్స్ట్ సినిమాని యూవీ క్రియేషన్స్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడుగా మెగా కాంపౌండ్ లో రామ్ చరణ్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది.దీంతో రామ్ చరణ్ ని వెంకి కలిసి ఒక స్టొరీ లైన్ చెప్పడం జరిగిందని, అది చరణ్ కి కూడా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది.
యూవీ క్రియేషన్స్ లో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి కమిట్ అయిన నేపధ్యంలో వెంకి రామ్ చరణ్ కి సరిపోయే కథ సిద్ధం చేస్తే ఆర్ఆర్ఆర్ కంప్లీట్ తర్వాత దీనిని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.మెగా కాంపౌండ్ లోకి వెళ్ళిన వెంటనే రామ్ చరణ్ లో స్టార్ తో సినిమా అంటే వెంకి ఓ విధంగా నక్క తోక తోక్కినట్లే అని చెప్పాలి.
ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే అఫీషియల్ లో కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాలి.