అవునండీ.అనాథలను దత్తత తీసుకొని దిల్ రాజుకు నిజంగా దిల్ ఉందని నిరూపించుకున్నాడు.ఎవరిని దత్తత తీసుకున్నాడు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన గట్టు సత్తయ్య అనే వ్యక్తి గత సంవత్సరం అనారోగ్యంతో మరణించాడు.
దీంతో అతని భార్య కూలి పనులు చేస్తూ పిల్లలను జాగ్రత్తగా చూసుకునేది.అయితే భర్త చనిపోయిన దిగులుతో మంచం పట్టిన భార్య అనురాధ రెండు రోజు రోజుల క్రితం మరణించింది.
దీంతో గ్రామస్థులు అంత చెందాలు వేసుకొని ఆమె అంత్యక్రియలు నిర్వహించగా వారికీ ఉన్న ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
ఇంకా ఈ విషయాన్నీ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆత్మకూరు సర్పంచితో మాట్లాడి పిల్లల సంరక్షణపై చర్చించగా ఈ విషయాన్ని నిర్మాత దిల్రాజుకు తెలిపారు.
అంతేకాదు అనాథలైన పిల్లలలను దత్తత తీసుకోవాలని కోరగా దిల్ రాజు సానుకూలంగా స్పందించి పిల్లలను దత్తత తీసుకున్నారు.దీంతో మంత్రి ఎర్రబెల్లి దిల్రాజుకు మరోసారి ఫోన్ చేసి అభినందించారు.