కరోనా వైరస్ ప్రభావం మనిషికి మనిషికి మద్యం భౌతిక దూరం పెంచేసింది.కుటుంబ సభ్యుల మధ్య అయిన కూడా కరోనా వస్తే కచ్చితంగా అంటరానివారిగా బ్రతకాల్సిందే.
కనీసం కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు కుటుంబ సభ్యులని కూడా పేషెంట్ ని చూడటానికి అనుమతించరు.ఇక ఆ కరోనా రోగి చనిపోతే అతని దహనం సంస్కారాలకి సంప్రదాయాలతో సంబద్ధం ఉండదు.
ఏదో వ్యాన్ లోనో లేక, ఇతర వాహనాల ద్వారానో, పూర్తిగా ప్లాస్టిక్ కవర్లలో చుట్టేసి స్మశానంలో ఖననం చేస్తారు.చివరి చూపు చూసుకోవడానికి కూడా లేకుండా అయిపొయింది.
ఇప్పుడు అలాంటి దుస్థితి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఒక వృద్ధుడికి వచ్చింది.
ఉదయపురం గ్రామంలో ఓ వృద్ధుడు ఆకస్మికంగా మృతి చెందాడు.
అతడిని కుటుంబ సభ్యులు స్మశానంకి తరలించే సమయంలో కలెక్టర్ తో సహా అధికారులు అక్కడికి చేరుకొని వారిని నియంత్రించి చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్షలు చేయించారు.వాటిలో వృద్ధుడుకి కరోనా ఉందని నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులని క్వారంటైన్ చేసి వారికి పరీక్షలు నిర్వహించారు.
అలాగే వారితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు.ఆ ప్రాంతాన్ని కంటైన్మేంట్ జోన్ గా చేసేసారు.ఇక చనిపోయిన వృద్ధుడు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లుతో చుట్టి జేసీబీ తొట్టెలో వేసి స్మశానంకి తరలించి ఖననం చేశారు.ఆ వృద్ధుడి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి కుటుంబ సభ్యులకి వచ్చింది.
దీనికి సంబంధించిన వీడియోని చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేసి ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ విమర్శలు చేశారు.అయితే నెటిజన్లు మాత్రం వారి మీద రివర్స్ ఎటాక్ చేసారు.
కరోనాతో చనిపోయిన వారిని అలా కాకుంటే వందలాది మంది వెళ్లి సంతాపం తెలిపి మోసుకొని వెళ్ళాలా, వారందరికీ కరోనా వస్తే మీరు బాధ్యులు అవుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు.