నల్లగొండ జిల్లా: అనేక సంవత్సరాలుగా విద్యార్థులు, యువకులు, ప్రజా ఉద్యమకారులు వివిధ రూపాలలో పోరాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక దశాబ్ద కాలం పాటు ప్రజావ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిన ప్రజలు,2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్తకుప్పలో విసిరేశారని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ(ఎంఎల్)సెక్రటరీ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
దీనితో నూతనంగా కాంగ్రేస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
కాంగ్రేస్ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తుందనో, లేదా కాంగ్రేస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనో, ఆయా సెక్షన్ల ప్రజలకు ప్రకటించిన డిక్లరేషన్లను నమ్మో వారికి ఓట్లు వేసి గెలిపించ లేదని,బీఆర్ఎస్ ఓట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయని జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ రిషి నేతాజీ రాజన్న జె.ఎస్.ఆర్.నేడు విడుదల చేసిన పత్రిక ప్రకటన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.వాస్తవానికి పోలాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ళు, నిధులు,నియమకాలను ఆశించిన ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లభించలేదని, అంతకంటే ముఖ్యమైన ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి ప్రజలను నిస్సహాయ స్థితిలోకి నెట్టారని,ఈ పదేళ్ళ కాలంలో కనీస చట్టబద్ద పాలన కాదుకదా, సాధారణ ప్రజాస్వామ్య విలువలను కూడా తుంగలోకితొక్కి,కేంద్రీకృత, నిరంకుశ అణిచివేత పాలనను కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల హక్కులను, ప్రశ్నించిన గొంతులను నొక్కేశారని,క్రింది ఉద్యోగులపై దౌర్జన్యపూరిత విధానాలను అమలు చేస్తూ వారిపై పని భారాన్ని పెంచారని ప్రజాతంత్ర ఉద్యమకారుడు,నూతన ప్రజాస్వామిక విప్లవ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ జేఎస్ఆర్ 9848540078 పేర్కొన్నారు.సామ్రాజ్యవాదుల,బడా కార్పోరేట్ల,భూస్వాముల, దోపిడి పాలకుల ప్రయోజనాల కోసం నీళ్ళు, నిధులను, నియమకాలను అక్రమంగా దారి మళ్ళించారని, ప్రైవేటీకరణకు ప్రాధాన్యతను కల్పించి ఇప్పటి వరకు ఉద్యోగ నియయమకాలు చేపట్టలేదని,అందువలన ఫోస్టు గ్రాడ్యుయేట్ చేసిన నిరుద్యోగులే 36 లక్షలపైగా పెరిగారని తెలిపారు.
నీళ్ళ కోసం వెచ్చించిన నిధుల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడడమేకాక,గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టు వలన పేద,మధ్య తరగతి రైతాంగ వ్యవసాయ సాగు భూములకు నీళు అందించలేకపోయారని చెప్పారు.మొత్తంగా తెలంగాణ ఏర్పడిన తరువాత బడా బడా కార్పోరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు,కేసీఆర్ కుటుంబం,వారి ప్రభుత్వంలో కొనసాగుతున్న కొద్ది మంది తాబేదారులు, కలిసి నీళ్ళను,నిధులను, భూములను అక్రమంగా కాజేశారన్నారు.
సమైక్య రాష్ట్రంలో జరిగిన దోపిడి కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మరింత ఎక్కువగా దోపిడి జరిగిందని,అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధానంగా కేసిఆర్, కేసిఆర్ కుటుంబంపై అన్ని రంగాల్లో అన్ని సెక్షన్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో రగిలిన ప్రజా వ్యతిరేకత, అనంతృప్తి,కోపం ఓట్ల రూపంలో కేసిఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాయని,అదే విధంగా మూడవ సారి అధికారం కోసం దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపితో రహస్య రాజకీయ అక్రమ సంబంధాన్ని కలిగి వుండడాన్ని ప్రజా ఉద్యమాలతో చైతన్యమైన సెక్యులర్ ప్రజలు మరింతగా బీఆర్ఎస్ ను అసహించుకున్నారని అభిప్రాయపడ్డారు.ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక,రాజకీయ ప్రలోభాలు ఎన్నిపెట్టినా ప్రజలు ఛీ కొట్టడంతో ఓటమి నుండి తప్పించుకోలేక పోయిందన్నారు.
ప్రజా వ్యతిరేక,దోపిడి, అణిచివేత విధానాలను అమలు చేసిన ఏ పార్టీనైనా ప్రజా తీర్చుతో చెత్తకుప్పలో విసిరేస్తూ వుంటారు.కానీ,ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం లేక మార్చి మార్చి అవే పార్టీలను అధికారంలోకి తీసుక రావడం అనేది విషాదకరంగా ఉందన్నారు.
ప్రజలారా.ప్రజాస్వామిక వాదులారా.
ప్రజా ఉద్యమకారులారా.కాంగ్రేస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక హమీలనిచ్చి అధికారాన్ని చేపట్టిందని, ప్రజాస్వామ్యాన్ని గ్యారంటినిస్తామని కూడా హమీనిచ్చిందని,అందుకే ప్రజల మౌళిక సమస్యలన్నింటిని పరిష్కరించమని అధికార పార్టీ కాంగ్రెస్ ను అడగండని ప్రజలను ప్రజాస్వామిక వాదులను ప్రజాసంఘాలను కామ్రేడ్ జేఎస్ఆర్ కోరారు.
అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే జాబ్ క్యాలెండర్ ప్రకటించి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామిని, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు కల్పించమనండి.ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థులకు విద్య అవకాశాలను ఉచితంగా కల్పించమనండని అభ్యుదయ వాది జెఎస్ఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆనంతరం ప్రెస్ మీట్ లో ప్రజలే పాలకులు,మేము సేవకులం అంటూ కాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య పాలన అన్నట్లుగా మాట్లాడారు.ఏ పాలకులైనా ప్రజలను నమ్మించడానికి పడి కట్టు పదాలను వాడుతారు.
తప్ప ఇందులో ఎంత మాత్రం వాస్తవం వుండదని,ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్న పాలకులు మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు వారిని నిస్క్రియా ప్రేక్షకులుగానే పరిమితం చేస్తారు తప్పు,ప్రజలకు రాజకీయ అధికారంతో ఏ మాత్రం భాగస్వామ్యం వుండదనే విషయాన్ని ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ పార్టీపాలన ప్రజాస్వామిక పాలనే అయితే ప్రజల ప్రజాస్వామిక,రాజకీయ నినాదాలను పరిష్కరించమని,ప్రజల హక్కుల కోసం గత మూడు దశాబ్దాలుగా నూతన ప్రజాతంత్ర సమాజం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవకారుడు సిపిఐ ఎంఎల్ సెక్రటరీ సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్ కోరారు.ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలను అడగడమనేది రాజ్యంగం కల్పించిన ప్రాథమిక హక్కు.
ప్రజలే పాలకులు అని చెప్పుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యం గురించి అడగుదాం.ఆధికారం చేపట్టిన వెంటనే ఇంటలీజెన్స్,కౌంటర్ ఇంటలీజెన్స్,యాంటి నక్సల్స్ ఇంటలీజెన్స్, ఎస్ఐబి,గ్రేహౌండ్స్ లో పని చేసి నేరపూరిత అనుభవం కలిగి వున్నా అదనపు డిజీ శివధర్ రెడ్డిని రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారంటేనే రేపటి ఉద్యమాలను అణిచివేయడానికి అనేది స్పష్టమవుతుందని, ప్రజాస్వామ్యత హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా నేస్తం కామ్రేడ్ జేఎస్ఆర్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు అక్రమకేసులు,ఎన్కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరకుకుంటున్నారని తెలిపారు.అరెస్టులు నిర్బంధాలు,తప్పుడు కేసులు,ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను నిర్మించడం సాధ్యమవుతుందా? అని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.జైళ్ళలో యేండ్ల తరబడి మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని,ప్రజా ఉద్యమకారులపై అర్బన్ నక్సలైట్లు కలంథారి కామ్రేడ్స్ ముద్ర వేస్తూ వారిని అక్రమ కేసుల్లో ఇరికించి ఊపా చట్టం దాడులు కొనసాగుతున్నాయని, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను వెంటనే నిలిపివేయాలని నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా ఉద్యమకారులపై ఇప్పటి వరకు పెట్టిన అక్షమ కేసులను వెంటనే ఎత్తివేయాలని,ధర్నాచౌక్ ను ఎలాంటి ఆంక్షలు లేకుండా పునరుద్ధరించాలని, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన వైరస్ లేఖలు జెఎస్ఆర్ విజ్ఞప్తి చేశారు.పౌర హక్కులకు, స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగని,కనీసం చట్టబద్ద పాలన అయినా కొనసాగించమని తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రజాస్వాగ ఉద్యమకారులు కామ్రేడ్ జేఎస్ఆర్ నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
భూమి లేని వారికి భూమి కల్పించాలి, రుణాలు మాపి చేయాలి, రైతుబంధు పేరిట ప్రజా ధనాన్ని భూస్వాములకు పంచే విధానాన్ని నిలిపి వేసి పేద,మధ్య తరగతి రైతులకు,కౌలు రైతులకు రైతు బంధు వర్తింప చేయాలని,రైతు బిడ్డ శ్రామిక ప్రజాబంధువు కామ్రేడ్ జేఎస్ఆర్ నూతన ప్రభుత్వాన్ని కోరారు.రైతు పండించిన పంటలకు మండీలు ఏర్పర్చి న్యాయమైన ధర కల్పించాలని,భూస్వాములకు అనుకూలమైన ధరణీ పోర్టును రద్దు చేయాలని,రాష్ట్రంలో మిగులు భూములను, ప్రభుత్వ,బంజరు భూములను వ్యవసాయ కూలీలకు పంచాలని,ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జైబోరన్న గారి సుభాషన్న నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ప్రజల నిర్వాసిత సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జెఎస్ఆర్ డిమాండ్ చేశారు.ఆదివాసీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి జుల్-జంగల్- అమీన్ పై పూర్తిగా ఆదివాసులకే అధికారం కల్పించాలని,పైసా చట్టాన్ని,5వ,6వ షెడ్యూల్డ్ చట్టాలను,అప్70చట్టాన్ని, జీవో నెంబర్ 30 అమలు చేయాలని,ఆదివాసీల చట్టాలకు విరుద్ధంగా ఏర్పరుస్తున్న పోలీస్ క్యాంపులను ఎత్తియాలని, తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కమ్యూనిస్టు నాయకుడు,కామ్రేడ్ జేఎస్ఆర్ కోరారు.
హరితహారాన్ని రద్దు చేసి ఆదివాసులపై వున్న కేసులను ఎత్తివేయాలని, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2006 ఆటని హక్కుల చట్టం ప్రకారం లబ్దిదారులకు పట్టాలు ఇవ్వాలని,ప్రైవేట్ రంగ సంస్థలను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాలని,ఆర్టీసి ప్రైవేటీకరణను నిలిపి వేయాలని,నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ రాసిన బహిరంగ లేఖలో ప్రజా ఉద్యమకారుడు, కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.ఓపెన్ కాస్టులను రద్దు చేయాలని,ఉత్పత్తి రంగాల్లో కాంటాక్టు కార్మికులను,ఔట్ సోర్సింగ్ కార్మికులను క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,డిపెండెంట్ ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని,కార్మికుల నిజా వేతనాలు పెంచాలని, వస్త్ర కార్మికులు,చిన్న తరహా ఉత్పత్తిదారుల హక్కులను,చిన్నతరహా మ్యానుఫాక్చరింగ్ రంగాల హక్కులను కాపాడాలని జెఎస్ఆర్ డిమాండ్ చేశారు.
కాజిపేట్ లో రైలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని,ఇవేవో ప్రజలు కోరుకునే గొంతమ్మ గోరికలు కాదని,చట్ట పరిధిలో ప్రభుత్వాలు అమలు చేయాల్సిన న్యాయమైన రాజ్యంగ హక్కులు మాత్రమేనని అభిప్రాయపడ్డారు.మహలక్ష్మి,రైతుభరోసా, గృహజ్యోతి,ఇందిరమ్మ ఇళ్ళు,యవవికాసం, చేయూత ఆరు గ్యారంటీల ఉచితాలు ప్రకటించారు.
వీటి వెనక వున్న ఉచితాల అంతర్యంను మనం అర్థం చేసుకోవాల్సిన ఆవసరం వుందని,పేదరికంలో మగ్గుతున్న వారి ఆదాయ వనరులు పెంచి పేదరికాన్ని నిర్మూలించి జీవిత భద్రతకు గ్యారంటి ఇవ్వకుండా ఇప్పటికీ 5 లక్షల కోట్ల అప్పుల్లో వున్న రాష్ట్రంలో ఉచిత స్కిమ్ లను అమలు చేస్తామంటున్నారు.వీటికి ఎక్కడి నుండి నిధులు సమకూర్చుతారనేది ప్రజలు ఆలోసించాలి.
ఇలాంటి పథకాలు చూడడానికి ఆకర్శణీయంగా ఉంటాయి కానీ,పన్నుల రూపంలో వాటిభారం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపైనే పన్నుల మీద పన్నులు వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పథకాల నిధుల కోసం పెట్రోల్, డిజిల్ ధరలు పెంచడం, నిత్యవసర సరుకుల ధరలు పెంచడం లేదంటే సామ్రాజ్యవాదుల,దేశ, విదేశ బడా కార్పోరేట్ల వద్ద ఒప్పందాలతో లక్ష కోట్ల రూపాయలు అప్పులు తీసుకరావడం, వారి ప్రయోజనాల కోసం నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం వంటి దోపిడి అణిచివేత విధానాలు రూపొందించి ప్రజల ఆస్తులను,ఖనిజ సంపదలను తెగనమ్మేస్తారని తెలిపారు.
తద్వారా ప్రజా ఉద్యమాలు ముందుకొస్తాయని, కార్పోరేట్ల దోపిడి ప్రయోజనాలకు ఆటంకంగా మారిన ఉద్యమాలను అణిచివేయడానికి పూనుకుంటారని,ఇక్కడే ప్రజల ప్రజాస్వామిక హక్కులను స్వేచ్ఛను పాలక ప్రభుత్వాలు చట్టాల రూపంలో కాలరాస్తున్నాయని, నేటి సమాజం సామ్రాజ్యవాదుల,దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల బడా భూస్వాములు పునాదులపై ఆధారపడిన ఈ రాజ్య వ్యవస్థ నిర్మితమై ఉందని,దోపిడ్ స్వభావం కలిగి ఉందని,కనుక అధికారంలోకి పాలక పార్టీలు ఎన్ని మారిన వాటి స్వభావం మారదని, నూతనంగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఏమి అధికారంలోకి రాలేదని పేర్కొన్నారు.వేల కోట్ల డబ్బు,మద్యంతో, ప్రజలను ప్రలోభ పెట్టిన సంగతి జగమెరిగిన సత్యం.
ఇంతటి అవినీతితో పార్టీలు అధికారాన్ని చేపట్టిన పార్టీ,భవిష్యత్తు లో ఎంతటి అనినీతికి పాల్చడబోతుందో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని ప్రకటించుకుందని, ఇందిర రాజ్యం అంటే దోపిడీ రాజ్యం అనే విషయం,ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని ఎంత అల్లకల్లోలం సృష్టించిందనే విషయం భారత ప్రజలందరికీ తెలియంది కాదన్నారు.
అందుకే ప్రజల మౌళిక సమస్యల పరిష్కారానికి ప్రజల రాజ్యాధికారం అనేది ప్రజల ప్రత్యామ్నాయం తప్ప మరొక్కటి లేదని, జనహితమే తనహితమై ప్రతిక్షణం ప్రజాహితం కోసం,ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న పీడత ప్రజా ఉద్యమ గొంతుక, కమ్యూనిస్టు విప్లవకారుడు జై బోరాన్నగారీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.వర్గ దోపిడికి సామాజిక వివక్షతకు సామ్రాజ్యవాదం చొరబాటుకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు నిరంతరం పోరాటం చేయాలని కోరారు.
భారతదేశంలో అనేక నేరాలు-ఘోరాలు పెరిగిపోవటానికి కారణం అవుతున్న,మనిషికి మనిషికి మధ్య మానవ సంబంధాలు నశించిపోవడానికి, అంతులేని ఆర్థిక అసమానతలు పెరిగిపోవడానికి కారణమవుతున్న భూమిని వ్యక్తిగత ఆస్తి నుండి తప్పించాలని మన దేశంలో గల యావత్ భూమిని జాతీయం చేయాలని జెఎస్ఆర్ నేతాజీ రాజన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థను కూడా రద్దు చేస్తూ అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని,కుల వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయుటకు కేంద్రంపై ఒత్తిడి చేస్తూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేయాలని, దుర్మార్గమైన కుల వ్యవస్థను రద్దు చేయుటకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ముఖ్యంగా అణగారిన కులాలుగా పేర్కొనబడే దళిత బహుజన కులాలు ఐక్యంగా ఉద్యమించాలని సామాజిక పరివర్తకుడు, సమసమాజ నిర్మాణానికి గత 30 సంవత్సరాలుగా ఉద్యమాల ఊపిరిగా, ప్రజాహితమే శ్వాసగా, సమసమాజ స్థాపన లక్ష్యంగా,పోరాటమే జీవితంగా జీవిస్తున్న అభ్యుదయవాది,ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ జై బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ ఋషి నేతాజీ రాజన్న జెఎస్ఆర్ 8328277285 కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ రేఖలో డిమాండ్ చేశారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy