శ్రీలంక స్విన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ని పాన్ ఇండియా రేంజ్ లో కోలీవుడ్ లో శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.800 టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు.తాజాగా విజయ్ సేతుపతికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా వచ్చింది.ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళనాడులో ఈ సినిమా అగ్గి రాజేసింది.తమిళనాడు ప్రజలు ఎక్కువగా ప్రాంతీయ మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తారు.వాళ్ళు జీవితం కాలం నిత్యం శ్రీలంకని ద్వేషిస్తూ ఉంటారు.
శ్రీలంకకి బ్రతుకుతెరువు కోసం వెళ్లిన తమిళులని అక్కడి ప్రభుత్వం ఊచకోత కోసి చంపేసింది.అలాగే దశాబ్దాల పాటు శ్రీలంక తమిళులకి, అక్కడి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతూ వచ్చింది.
ఈ నేపధ్యంలో తాము విపరీతంగా ద్వేషించే శ్రీలంక దేశానికి చెందిన క్రికెటర్ జీవిత కథలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించడమే వారి ఆగ్రహానికి కారణం అయ్యింది.ఈ బయోపిక్ ని ఉన్నపళంగా నిలిపేయాలని తమిళనాడు ప్రజలు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతికి కూడా నటించొద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
మురళీధరన్ తమిళుడు అయినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళ ప్రజలని చంపుతూ పోతుంటే కనీసం ప్రశ్నించలేదని, శ్రీలంక మతవాదానికి మురళీధరన్ మద్దతు ఇచ్చి తమిళులకి నమ్మకద్రోహం చేసాడని ఆరోపిస్తున్నారు.
అలాంటి నమ్మకద్రోహి జీవిత కథతో నటించొద్దని డిమాండ్ చేస్తున్నారు.కోలీవుడ్ లో సీనియర్ దర్శకుడు భారతీరాజా సైతం విజయ్ సేతుపతికి మురళీధరన్ బయోపిక్ లో నటించొద్దు అని హితవు పలికారు.
దీనిపై ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు.శ్రీలంక మతవాదనకి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య మురళీధరన్ ఒక మురళీధరన్ నమ్మకద్రోహి అని పేర్కొన్నారు.దర్శకుడు శీను రామస్వామి, చేరన్ కూడా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్సేతుపతికి విజ్ఞప్తి చేశారు.మరోవైపు తమిళ సంఘాలు కూడా మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తే అతని సినిమాలు అన్ని కూడా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపధ్యంలో విజయ్ సేతుపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి.