బడా నిర్మాత దిల్ రాజు భాగస్వామి శిరీష్ కొడుకు ఆశీష్ రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు.
దిల్ రాజు నిర్మాతగా, హుషారు ఫేమ్ హర్ష దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.ఈ మోషన్ పోస్టర్ హీరో, హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉంది.
ఈ పోస్టర్ ద్వారా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అనే విషయాన్ని చిత్ర యూనిట్ రివీల్ చేసింది.రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో మళ్ళీ నటిస్తుంది.
ఆమె చివరిగా రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా కనిపించింది.
అయితే ఆ సినిమా హిట్ అయిన అనుపమకి పెద్దగా వచ్చిన గుర్తింపు అయితే లేదు.ప్రస్తుతం ఈ భామ నిఖిల్ తో 18 పేజెస్ అనే లవ్ స్టొరీ సినిమాలో నటిస్తుంది.
అలాగే కార్తికేయ సీక్వెల్ లో కూడా హీరోయిన్ గా చేస్తుంది.ఈ రెండు సినిమాలలోనే ఈ భామ నటిస్తుందని అందరూ అనుకుంటూ ఉండగా ఇప్పుడు కొత్త హీరోతో దిల్ రాజు బ్యానర్ లో కూడా అనుపమ మరో సినిమా చేస్తుందనే విషయం రివీల్ అయ్యింది.
కొత్త హీరో కావడం వలన అనుపమ క్రేజ్ నేపధ్యంలో సినిమాలో ఆమె పాత్ర డామినేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.
.