అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ శాంతి సందేశం ఇస్తున్నారు.యుద్దాలతో ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతోంది అంటూ శాంతి సందేశం ఇచ్చే పనిలో పడ్డారు.
అందరూ శాంతంగా ఉండాలని హితబోద చేస్తున్నారు.తాను అధ్యక్షుడుగా ఉన్న సమయంలో తీసుకున్న ఎన్నో తొందరపాటు నిర్ణయాల వలన ఎంతో మంది ఇప్పుడు అనాధలుగా మిగిలారని ఆయన తెలిపారు.
యుద్ధం లేకుండా ఉండే విధానాలపై చర్చలు జరగాలని ఆయన పిలుపు ఇచ్చారు.ఈ క్రమంలోనే
వీర జవాన్లకి నివాళులు అర్పిస్తూ యుద్దాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలని కళ్ళకి కట్టేలా పెయింటింగ్ రూపంలో చూపించారు.
వాషింగ్టన్ లోని కెన్నడీ సెంటర్ లో ఈ చిత్రాల ప్రదర్సన ఉంచారు.ఇదిలాఉంటే ఒక పక్క ట్రంప్ యుద్ద పిపాసిలా మారుతూ యుద్దోన్మాదం ప్రదర్శిస్తూ ఉండగా మాజీ అధ్యక్షుడు బుష్ శాంతి సందేశం ఇవ్వడంతో అమెరికా రాజకీయ వర్గాలలో తీవ్రమైన చర్చకి దారితీస్తోంది.
రిపబ్లికన్ పార్టీ నేత అయిన జార్జ్ బుష్ గతంలో టెక్సాస్ గవర్నర్ గా పనిచేసారు.ఆ తరువాత అమెరికా అధ్యక్షుడిగా కొనసాగారు.బుష్ ఆధ్వర్యంలోనే ఇరాన్ పై యుద్ధం రెండు సార్లు ప్రకటించడం జరిగింది.ఈ సంఘటనల నేపధ్యంలోనే 2010 లో బుష్ డెసిషన్ పాయింట్స్ అనే పుస్తకాన్ని రచించారు.
.