ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.
ఈ సినిమా హిందీ మార్కెట్ లో అందుకున్న విజయం బన్నీ కెరీర్ ను టాప్ లో నిలబెట్టింది.
ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా హిందీ మార్కెట్ లో హవా చూపించింది.ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండానే ఈ సినిమా అక్కడ 100 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.
ఈ సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.ప్రెసెంట్ బన్నీ వృషీకేశ్ లో పర్యటిస్తున్నారు.వారం రోజుల పాటు అక్కడే ఉండి అనేక క్షేత్రాలను దర్శించుకుని ఈ వారాంతంలో హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లో సుకుమార్, బన్నీ కలిసి స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొనబోతున్నారట.మార్చి లోనే ఫైనల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేసి ఏప్రిల్ నుండి రెగ్యురల్ షూటింగ్ కు వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాతనే సెట్స్ మీదకు వెళ్లాలని సుకుమార్, బన్నీ అనుకుని ఇప్పటి వరకు ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు.బన్నీ తో సుకుమార్ చర్చలు జరిపి ఫైనల్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసిన తర్వాతనే పట్టాలెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.