అక్కినేని యువహీరో అఖిల్ హీరోగా అఖిల్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.అయితే తను నటించిన మొదటి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అఖిల్ సినిమా తర్వాత వచ్చిన మరో రెండు సినిమాలు కూడా అఖిల్ కి ఎలాంటి గుర్తింపు తీసుకు రాలేదని చెప్పవచ్చు.ఎలాగైనా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం యువ హీరో నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్“.ఈ సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటించడం మనకు తెలిసినదే.
ఈ సినిమా తరువాత అఖిల్ మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అఖిల్ సినిమాలో యాక్షన్ తరహాలో నటించిన ఈ హీరో ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ తరహా చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.ఇప్పటికే సురేందర్ రెడ్డి రేసుగుర్రం, సరైనోడు యాక్షన్ తరహా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై పాత్రలో అఖిల్ కనిపించనున్నాడు.ఈ పాత్ర కోసం అఖిల్ తన స్టైల్ మొత్తం మార్చి ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ప్రస్తుతం అఖిల్ న్యూ లుక్ లో ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకోవడంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఒక రెగ్యులర్ గా కాకుండా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నట్లు అర్థమవుతోంది.
అఖిల్ షేర్ చేసిన ఫోటోలో కండలు తిరిగిన శరీరాకృతిని కలిగి ఉండటమే కాకుండా హెయిర్ స్టైల్ మొత్తం మార్చేశాడు.ఈ విధంగా సురేందర్ రెడ్డి వల్ల అఖిల్ తన స్టైల్ మార్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.