టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల కూడా కీలక పాత్ర పోషించింది.
సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో అమల కూడా పాల్గొంటుంది.తాజాగా అక్కినేని అమల తో పాటు ఆమె గారాల పుత్రుడు అక్కినేని అఖిల్ కూడా ఒక స్పెషల్ వంట ప్రోగ్రాం లో పాల్గొన్నారు.
ఈ ప్రోగ్రాం లో అఖిల్ ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.దీనికి సంబందించిన ప్రోమో తాజాగా రిలీజ్ అవ్వగా అందులో అఖిల్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
డార్లింగ్ ప్రభాస్ గురించి ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడడంతో అవి అందరిని ఆకర్షించాయి.
ప్రభాస్ ఆహార ప్రియుడని తాను విన్నానని అమల తెలిపింది.
అప్పుడు శర్వానంద్ కూడా ఈ విషయంపై మాట్లాడారు.వీరిద్దరూ మాట్లాడిన మాటలను అఖిల్ కూడా ఏకీభవిస్తూ.ఆతిధ్యం విషయంలో అయినా ఇతరులకు ప్రేమను ఆప్యాయతను పంచడంలో కానీ ప్రభాస్ ఎవరిని అంత తేలికగా వదిలి పెట్టడు అంటూ చెప్పడం అందరిని ఆకట్టుకుంది.
ఇక శర్వానంద్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక బాధ పడుతున్నారు.ఈయన నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి.దీంతో ఇప్పుడు శర్వా ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నాడు.
టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేయగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ ,ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు.ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాకు జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.