40 ఏండ్లకు కలుసుకున్నారు.. ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రాజన్న సిరిసిల్ల జిల్లా : 40ఏండ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులు అదే బడిలో కలుసుకొని వారి అనుబూతులను పంచుకున్నారు.ఎల్లారెడ్డిపేట హైస్కూల్ లో 1982-,83 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

 A Great Alumni Reunion Of Yellareddypet High School Students After 40 Years, Gr-TeluguStop.com

నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు.అనంతరం పాల్గొన్న వారికి మెమోంటోలను అందజేశారు.

ఈ సమ్మేళనంలో రాధాకృష్ణ , బండారి బాల్ రెడ్డి, శ్రీగాధ అశోక్ ,బందారపు బాల్ రెడ్డి, రామ్, సురేష్ , లక్ష్మారెడ్డి, గుండాడి రాం రెడ్డి,తీగల రాజేష్ గౌడ్ , ఇంద్రాసేనారెడ్డి , బచ్చు ఆంజనేయులు , రాపెల్లి దేవాంతం, దుమాల శంకర్ , దేవాదాస్ , దాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube