ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.ఈ సినిమా విజయం సాధించాలన్న లేదంటే పరాజయం అందుకోవాలన్న అది కేవలం ప్రేక్షకుల వల్లే సాధ్యమవుతుంది.
ప్రేక్షకులు లేని సినిమా ఇండస్ట్రీని ఊహించుకోలేము.వారు ఓకే అన్నదే హిట్ అవుతుంది.
లేదు అంటే అది ఫట్ అవుతుంది.అందుకే చాలా మట్టుకు హీరోలంతా కూడా ప్రేక్షకుల మధ్యకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తారు.
ఇక టాలీవుడ్ ( Tollywood )లో కొంతమంది హీరోలు ఫ్యాన్స్ చేత వార్నింగ్ కూడా చేయబడ్డారు.మరి ఎందుకు ఈ హీరోలను ఫాన్స్ టార్గెట్ చేశారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నాటి కాలంలో తీసుకుంటే హీరో కృష్ణ( Hero Krishna ) గారిని అభిమానులు ధర్నా చేసి మరీ వార్నింగ్ ఇచ్చారు.ఎందుకు అంటే కృష్ణ కూతురు మంజుల( Daughter Manjula ) హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది.మీ కుటుంబంలో ఆడవారిని హీరోయిన్స్ గా చేయడం మాకు ఇష్టం లేదు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.అంతెందుకు నిన్న మొన్న రజినీకాంత్( Rajinikanth ) జైలర్ సినిమా విషయంలో కూడా ఫాన్స్ దారుణంగా వార్నింగ్ ఇచ్చారు.
తమ ఇష్టమైన అభిమాన నటుడు రజనీకాంత్ కి తెల్ల జుట్టు పెడితే ఊరుకోమని ఆ సినిమా డైరెక్టర్ నెల్సన్ కి రజనీకాంత్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారట.దాంతో డైరెక్టర్ కాస్త భయపడ్డా ఆ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కన్విన్స్ అయ్యారు.
ఇక చిరంజీవిని( Chiranjeevi ) ఒక సినిమాలో కొడితే ఆయన అభిమానులు కూడా ఆ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చారట తమ హీరో విలన్స్ ని కొట్టాలి కానీ విలన్ ఎప్పుడు హీరోని కొట్టకూడదు అన్నట్టుగా చిరంజీవి సినిమాలు అందుకే ఇలా తయారయ్యాయి.ఇక ఇటీవల ఒక సినిమా ప్రమోషన్ లో అక్షయ్ కుమార్, జాకి ష్రాఫ్ చాలా పబ్లిక్ ప్లేస్ లో స్టాండ్స్ చేశారట.ఫాన్స్ కి ఆ స్టంట్స్ నచ్చలేదో మరి సినిమా నచ్చలేదో తెలియదు కానీ వారిపై చెప్పుల వర్షం కురిపించారు.ఇక గ్యాంగ్ సాబ్ గోదావరి సినిమా షూటింగ్ టైంలో ఒక అభిమాని హీరో విశ్వక్ సేన్ ( Hero Vishwak Sen )ని సెల్ఫీ అడిగితే అప్పటికే టైడ్ అయి ఉన్నానని ఇప్పుడు కుదరదు అని చెప్పడంతో సినిమా షూటింగ్ ఇక్కడే చేస్తావుగా.
చివరి వరకు ఏదో ఒకటి చేస్తాను.నీ అంతు చూస్తాను అంటూ బెదిరించారట సదర్ ఫ్యాన్.