ఈనెల 22న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇవ్వాలి..: బండి సంజయ్

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 22న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు.22న అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సెలవు ఇవ్వాలని కోరారు.

 The State Government Should Give A Holiday On 22nd Of This Month..: Bandi Sanjay-TeluguStop.com

రామ మందిర నిర్మాణనిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగంలో ఉందని బండి సంజయ్ తెలిపారు.ఈ నేపథ్యంలో దైవ కార్యాన్ని రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు.సెలవు దినంగా ప్రకటించి పవిత్రమైన దైవ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా చూడాలని తెలిపారు.హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో సీతారామచంద్ర స్వామివారిని ఆయన దర్శించుకున్న అనంతరం సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి విన్నవించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube