ఓ వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడ్డలితో భార్యపై దాడికి దిగి.అదే గొడ్డలితో భార్య, కుమారుడి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన నల్గొండ జిల్లాలో( Nalgonda District ) చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గాసిరాంతండాలో నివాసం ఉండే రమావత్ రవీందర్(48) వ్యవసాయం చేసుకుంటూ మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఇతడికి భార్య మంగి, కుమారుడు శేషు కుమార్, కుమార్తె నికిత ఉన్నారు.
కుమార్తె నిఖితకు వివాహం చేశాడు.కుమారుడు శేషు కుమార్ ఆటో నడుపుతున్నాడు.
![Telugu Devarakonda, Nalgonda-Latest News - Telugu Telugu Devarakonda, Nalgonda-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/12/crime-crime-news-murder-Nalgonda-District.jpg)
అయితే రవీందర్( Ravinder ) గత కొంతకాలంగా తాగుడుకు బానిస అయ్యాడు.అంతేకాకుండా పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, కుమారుడితో గొడవ పడేవాడు.బుధవారం ఓ ఫంక్షన్ కు వెళ్లి, మద్యం సేవించి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు.ఎన్నిసార్లు తలుపు కొట్టిన భార్య, కుమారుడు తలుపులు తీయకపోవడంతో.ఆగ్రహానికి లోనైన రవీందర్ పక్కనే ఉన్న గొడ్డలితో భార్య, కుమారుడిపై దాడికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో భార్య, కుమారుడు తిరగబడి అదే గొడ్డలితో రవీందర్ పై దాడి చేశారు.
దీంతో రవీందర్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.మద్యం మత్తులో ఉండడం వల్ల రవీందర్ ను వాళ్లు పట్టించుకోలేదు.
![Telugu Devarakonda, Nalgonda-Latest News - Telugu Telugu Devarakonda, Nalgonda-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/12/crime-crime-news-murder-Nalgonda-District-Devarakonda-Government-Hospital.jpg)
గురువారం ఉదయం లేచి చూసేసరికి రవీందర్ విగత జీవిలా పడి ఉన్నాడు.ఈ విషయాన్ని బయటకు తెలియకుండా బంధువుల సమక్షంలో అంత్యక్రియలు చేసేందుకు అంతా సిద్ధం చేశారు.కానీ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి( Devarakonda Government Hospital ) పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.రవీందర్ కుమార్తె నికిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు( police ) దర్యాప్తు చేస్తున్నారు.