సాయిచంద్ మరణం తీరని లోటు - వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య

తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, సాయిచంద్ మరణం తీరని లోటు అని రుద్రoగి మండల వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండలం మానాల గ్రామంలో సాయిచంద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు.

 Saichand Death Is A Huge Loss Vice Mpp Pisari Bhumaiya, Saichand , Vice Mpp Pisa-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భూమయ్య,బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని రాజేశం, నరేష్ నాయక్ ,భూమా నాయక్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube