అచ్యుతాపురం సెజ్ లో అదుపులోకి రాని మంటలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.సాహితీ ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు పేలడంతో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

 Uncontrollable Fire In Achyutapuram Sez-TeluguStop.com

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఐదు గంటలకు పైగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ఏడుగురి తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

మరోవైపు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడ్డారు.కాగా ఘటనా సమయంలో కంపెనీలో మొత్తం 35 మంది కార్మికులు ఉన్నారని సమాచారం.

వారిలో 28 మంది క్షేమంగా బయటపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube