అచ్యుతాపురం సెజ్ లో అదుపులోకి రాని మంటలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.సాహితీ ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు పేలడంతో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఐదు గంటలకు పైగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ఏడుగురి తీవ్రంగా గాయపడ్డారు.బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.మరోవైపు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడ్డారు.

కాగా ఘటనా సమయంలో కంపెనీలో మొత్తం 35 మంది కార్మికులు ఉన్నారని సమాచారం.

వారిలో 28 మంది క్షేమంగా బయటపడ్డారు.

కొండా సురేఖ తప్పు తెలుసుకున్నా.. నష్టం తీవ్రంగానే ?