తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుస విషాదాలు చోటు చేసుకుంటూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీకి తీరని లోటు మిగులుస్తున్నారు.ఈ ఏడాది ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు మరణించిన విషయం మనకు తెలిసింది.
తాజాగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సైతం కన్నుమూశారు.ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా నటించి మెప్పించిన కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్య సమస్యలతో మరణించారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కైకాల హైదరాబాద్ లోనిఫిలింనగర్ దగ్గరలోని ఉన్నటువంటి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఈయన చికిత్సకు కూడా స్పందించకపోవడంతో నేడు తుది శ్వాస విడిచారు.
ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించిన ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఇండస్ట్రీలో సుమారు 700కు పైగా సినిమాలలో నటించిన కైకాల యమధర్మరాజు పాత్రలలో అద్భుతమైన నటనను కనపరిచారు.నటనపై ఎంతో ఆసక్తి కలిగినటువంటి కైకాల సిపాయి కూతురు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఈయనకు నివాళులు అర్పించారు.