సినీ నటి ఖుష్బు సుందర్ ఆస్పత్రి పాలయ్యారు.తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
వెన్నెముక సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.రెండు రోజుల్లో మళ్లీ రోజువారీ విధుల్లో పాలుపంచుకుంటానని తెలిపారు.
ప్రస్తుతం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.ఇటీవల ఖుష్బు బరువు తగ్గించుకున్న విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.