నందమూరి బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఈయన ఆహాలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో మేకర్స్ రెండవ సీజన్ కూడా ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని మంగళవారం విజయవాడలో ఎంతో ఘనంగా లాంచ్ చేశారు.
ఇలా బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించడంతో ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరవుతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇకపోతే ఈ కార్యక్రమం ప్రోమో లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరి నుంచి బాలకృష్ణకు ఇదే ప్రశ్న ఎదురయింది.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోలు పాల్గొనే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించగా తప్పకుండా ఉంటుంది.ఇది వాళ్ళ ఇష్టం వారి సమయానకు అనుకూలంగా వాళ్లని ఈ కార్యక్రమానికి తీసుకువచ్చేలా టీం ప్రయత్నం చేయాలి అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ ఈ విషయంపై స్పందించారు.అయితే బాలకృష్ణ ఈ విధంగా స్పందించడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి వస్తారని తెలుస్తోంది.
అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుంది.