ఖమ్మం :నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.
అంబేడ్కర్ పేరు పెట్టడం హర్షణీయమని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చట్ట సభలు వాటి నిర్వహణ ఎలా ఉండాలో అంబేడ్కర్ ఒక దిశానిర్దేశం చేశారన్నారు.అటువంటి మహానీయుని పేరు తెలంగాణ సచివాలయానికి నామకరణం చేయడం కేసీఆర్కు విలువల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని స్పష్టం చేశారు.
పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన జరిగే శాసనసభకు అంబేడ్కర్ పేరు అన్ని విధాల సముచితం అని పొంగులేటి పేర్కొన్నారు.