దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది.ఊహించని విధంగా కేసులు ఒక్కసారిగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని తెలపటం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే మరో పక్క మహమ్మారి మాత్రం ఎక్కడా తగ్గటం లేదు.దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను, సామాన్యులను ఎవరిని విడిచి పెట్టడం లేదు.దీంతో చాలా రాష్ట్రాలలో కేసులు పెరిగిపోతుండటంతో స్కూల్స్, కాలేజీలు క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి తాజాగా కరోనా పాజిటివ్ రావడం జరిగింది.ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.దీంతో తన ని గత వారం నుండి కలిసిన ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.