ప్రముఖ గాయిని సునీత రెండవ పెళ్లికి వివాహం ముహూర్తం ఫిక్స్ అయ్యింది.ఈనెల 26వ తారీకున పెళ్లి కోసం రెండు కుంటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
సునీత మరియు రామ్ లు ఇద్దరు కూడా ఇంతకు ముందు విడాకులు తీసుకున్న వారే.సునీతకు ఇద్దరు పిల్లలు ఉండగా రామ్ కు పిల్లలు ఏమీ లేరు.
ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఈ సమయంలో ఒకరి అవసరం మరొకరికి ఉంటుందని నిర్ణయానికి వచ్చి అందరి ఉద్దేశ్యాలు తీసుకుని పెళ్లికి సిద్దం అయ్యారు.వీరి పెళ్లి విషయమై అభిమానులు అంతా కూడా ప్రశంసిస్తున్నారు.
ఒక్కరు కూడా వీరిని ట్రోల్ చేయడం లేదు.అది నిజంగా అభినందనీయం.
ఇక పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల నేపథ్యంలో పెళ్లికి హాజరు కాబోతున్న గెస్ట్ లు ఎవరు అయ్యి ఉంటారు అంటూ చర్చ జరుగుతోంది.
సునీతకు సినిమా ఇండస్ట్రీలో నలుగురు అయిదుగురు ఆప్త మిత్రులు ఉన్నారు.
వారిని పెళ్లికి ఆహ్వానించబోతున్నారు.అలాగే యాంకర్ సుమ మరియు జాన్సీలు కూడా సునీతకు మంచి స్నేహితులు.
వారు కూడా ఈ పెళ్లికి హాజరు అయ్యే అవకాశం ఉంది.ఇంకా కొందరు బయటి మిత్రులు మాత్రమే ఈ పెళ్లికి ముఖ్య గెస్ట్లు.
అంతకు మించి ఈ పెళ్లికి ఎవరు హాజరు అవ్వడం లేదని అంటున్నారు.పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమంగా ఈ పెళ్లిని సునీత మరియు రామ్ ల కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు.
సునీత పెళ్లి వ్యవహారాలు అన్ని కూడా ఆయన కొడుకు మరియు కూతురు దగ్గరుండి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఒక విషయం చెప్పాలంటే ఆ పిల్లలు ఇద్దరే స్వయంగా అమ్మను ఒప్పించి పెళ్లికి ఓకే చెప్పించారని కుటుంబ సభ్యులు అంటున్నారు.
నిజంగా అంత మంచి పిల్లలు సునీత కలిగి ఉండటం ఆమె అదృష్టం అంటూ ఆమె బంధు మిత్రులు అంటున్నారు.