టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ కెరియర్ లో సక్సెస్ లు కంటే ఫ్లాప్ లు ఎక్కువ.మంచి కామెడీ టైమింగ్, నటుడుగా మంచి పెర్ఫార్మర్ అనిపించుకున్న సందీప్ కిషన్ ఎందుకనో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు.
ఇప్పటి వరకు కెరియర్ లో కమర్షియల్ గా మూడు హిట్స్ మాత్రమే వచ్చాయి.రొటీన్ కథలని తీసుకోవడం వలన సందీప్ కిషన్ సక్సెస్ రేటు తక్కువగా ఉంది.
రీసెంట్ గా తెనాలి రామకృష్ణ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా కూడా డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది.
ప్రస్తుతం ఏ1 ఎక్స్ ప్రెస్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా హాకీ నేపధ్యంలో తెరకెక్కుతుంది.>
ఇందులో సందీప్ కిషన్ కి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు సందీప్ కిషన్ మరో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.తెనాలి రామకృష్ణ ఫేమ్ జి నాగేశ్వరరావు దర్శకత్వంలోనే మరో కామెడీ ఎంటర్టైనర్ సినిమా సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతుంది.
ఈ సినిమా షూటింగ్ విశాఖలో ఈ నెల 16 నుంచి మొదలు కానుంది.కోన వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ గా నేహశెట్టి నటిస్తుంది.మెహబూబా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు సందీప్ కిషన్ తో రెండో సినిమా చేసే అవకాశం సొంతం చేసుకుంది.
ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నేహాశెట్టి నటిస్తున్నట్లు తెలుస్తుంది.మరి సందీప్ కిషన్ కి ఈ సినిమా అయినా సాలిడ్ బ్రేక్ ఇస్తుందో లేదో అనేది వేచి చూడాలి.