ప్రస్తుతం డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫాంలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల సినిమాల వరకు ప్రతి ఒక్కటి ఈ ప్లాట్ఫాంపై రిలీజ్ చేస్తూ ఆయా కంపెనీలు భారీ లాభాలను గడిస్తున్నాయి.
అటు దర్శకనిర్మాతలకు కూడా భారీ మొత్తాన్ని ముట్టజెప్పడంతో వారు కూడా లాభాలను పొందుతున్నారు.అయితే భవిష్యత్తులో సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలలో డిజిటల్ రిలీజ్లు ఉంటాయని సినీ విశ్లేషకులు గతంలోనే చెప్పారు.
ఇప్పుడు ఈ విషయం నిజం అవుతోందనే చెప్పాలి.టాలీవుడ్లో ఇప్పటికే పలు చిత్రాలను నేరుగా డిజిటల్ రిలీజ్ చేయాలంటూ దర్శకనిర్మాతలకు కళ్లు చెదిరే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
తాజాగా యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమాకు ఇలాంటి ఆఫర్ వచ్చి పడటంతో సదరు చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డారట.కాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఓ సినిమా నేరుగా డిజిటల్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
అయితే సందీప్ తమిళంలో నటించిన నరగసూరన్ అనే సినిమాను నేరుగా డిజిటల్ రిలజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమాలో అరవింద్ స్వామి, శ్రియా, ఆథ్మిక, ఇంద్రజిత్ సుకుమారన్ వంటి నటీనటులు కూడా నటించారు.
2017లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఇప్పటివరకు రిలీజ్ కాలేదు.కాగా మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది.
దీంతో మరోమార్గం లేకపోవడంతో ఈ సినిమాను ఏప్రిల్ 17న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాను కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశాడు.ఈ విధంగా నేరుగా డిజిటల్ రిలీజ్కు వెళుతున్న తొలి తెలుగు హీరోగా సందీప్ కిషన్ రికార్డుకెక్కాడు.