ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి అత్యాచార ఘటనలు ఎక్కువ అవుతున్నాయి.తాజాగా 12 సంవత్సరాలు కలిగినటువంటి ఒక చిన్నారిపై 34 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన గుంటూరు జిల్లాలోని బాపట్లలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే తే బాపట్ల మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలిక తన అమ్మమ్మ తాతయ్య దగ్గర నివసిస్తోంది.ఈ బాలిక తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది.
దీంతో అప్పటి నుంచి చి తన అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఈ చిన్నారి ఉంటుంది.వీళ్లు గ్రామంలో చిన్న కూలిపనులు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాళ్ళు.
అయితే ఈ క్రమంలో గ్రామంలోని పక్క కాలనీలో కట్టా విజయ్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.ఇతడు చిన్నారిపై కన్నేసి ఎలాగైనా లొంగదీసుకోవాలని పథకం పన్నాడు.
అయితే నిన్నటి రోజున బాలిక అమ్మమ్మ, తాతయ్యలు పని నిమిత్తం బయటికి వెళ్ళగా చిన్నారి ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటోంది.ఇది గమనించిన విజయ్ కుమార్ ఆ చిన్నారిని ఇంట్లోకి ఎత్తుకెళ్లి దారుణంగా పలుమార్లు అత్యాచారం చేశాడు.అయితే ఆ తర్వాత మళ్లీ అత్యాచారానికి ప్రయత్నించగా బాలిక బిగ్గరగా అరిచింది.అప్పటికే పనిని ముగించుకొని ఇంటికి వచ్చిన చిన్నారి తాతయ్య అతడిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అలాగే నిందితుడు విజయ్ కుమార్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.