రాజస్థాన్ కాంగ్రెస్ లో మళ్లీ ముసలం మొదలైంది.సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గెహ్లాట్ కూడా ఆజాద్ దారిలో వెళ్తున్నారని ఆరోపించారు.అందుకే ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్ పరస్పరం ప్రశంసించుకుంటున్నారని తెలిపారు.
పార్లమెంట్ లో ఆజాద్ ను మోదీ పొగిడిన తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసని చెప్పారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తం కావాలని సూచించారు.
హైకమాండ్ ఆదేశాలను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.