అల్లు అర్జున్, సమంత జంటగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పటికే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్లో కూడా భారీ కలెక్షన్స్ను రాబడుతోంది.
‘ఓకే బంగారం’ సినిమా విడుదల అయిన తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్స్కు నిలకడగా ఉన్నాయి.‘ఓకే బంగారం’ కేవలం క్లాస్ ఏరియాలకే పరిమితం అవ్వడంతో మాస్లో ఇప్పటికి కూడా సత్యమూర్తి కలెక్షన్స్లో దూసుకు పోతున్నాడు.
అయితే ఈ సినిమా కలెక్షన్స్కు బ్రేక్ పడే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు.
హాలీవుడ్ సినిమా ‘అవేంజర్స్’ ఘన విజయం సాధించింది.
తెలుగులో కూడా ‘అవేంజర్స్’కు మంచి ఫాలోయింగ్ ఉంది.తాజాగా ఈ సినిమాకు సీక్వెల్గా ‘అవేంజర్స్`2’ రాబోతుంది.
ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ పూర్తి అవుతున్నాయి.భారీ అంచనాల నడుమ ఈ సినిమా వస్తుండటంతో తెలుగులో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
మాస్ ప్రేక్షకుల్లో ఈ సినిమాకు మంచి ఆధరణ దక్కే అవకాశాలున్నాయి.ఈ సినిమాతో పాటు చైతూ ‘దోచేయ్’ సినిమా కూడా ఇదే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దాంతో ఈ రెండు సినిమాల వల్ల సత్యమూర్తి కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశాలున్నాయని చిత్ర నిర్మాత టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.