రాహుల్ గాంధీని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమేనా అంటూ వైయస్ షర్మిల నిరసన..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.విషయంలోకి వెళ్తే భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని( Rahul Gandhi ) అస్సాంలో అడ్డుకోవడంతో పాటు ఆయనపై కొంతమంది దాడులకు కూడా పాల్పడటం జరిగింది.

 Ys Sharmila Protest Saying It Is Democracy To Stop Rahul Gandhi Details, Ys Shar-TeluguStop.com

ఈ దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీపై వైయస్ షర్మిల సీరియస్ అయ్యారు.బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో పాల్గొన్న వారిపై దాడి చేయడం జరిగింది.

రాహుల్ గాంధీకి ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేశారు.శాంతీయుత యాత్రను బీజేపీ( BJP ) అడ్డుకోవడం.ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు.జనవరి ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా షర్మిల ఈనెల 21న ఏపీ పీసీసీ చీఫ్( AP PCC Chief ) బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టాక వైసీపీ, తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడటం జరిగింది.ఇదే సమయంలో రాష్ట్రములో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.

ఈ క్రమంలో మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టడం జరిగింది.ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి వైయస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ( Idupulapaya ) వరకు పర్యటించడానికి రెడీ అయ్యారు.ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా వైయస్ షర్మిల కార్యచరణ చేపడుతున్నారు.ఈ క్రమంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రనీ( Bharat Jodo Nyay Yatra ) అస్సాంలో బీజేపీ పార్టీ నేతలు అడ్డుకోవడంతో వైయస్ షర్మిల విశాఖపట్నంలో.

జీవీఎంసీ వర్ధన్ నిరసన చేపట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube