ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తనదైన వ్యుహాలకి పదును పెడుతున్నారు.టీడీపీ నుంచీ కీలక ఎమ్మెల్యే లని తన పార్టీలోకి జంప్ చేయించడం, వారితో పాటు మరింతమందిని ఆకర్షించి టీడీపీలో ఆందోళన కలిగించడం ఇందంతా ఒక ఎత్తయితే అసలు వ్యూహం మరొకటి కూడా ఉంది.
చంద్రబాబు మెడలో కులం కార్డ్ తగిలించడం.ఇప్పుడు ఆపనిలోనే జగన్ బిజీ బిజీగా ఉన్నారు.
ఎంతగా కులం రంగు పులిమితే అంతగా మిగిలిన నేతలు మెల్లగా సైడ్ అవుతారు అనేది జగన్ లెక్క అంతేకాదు.
చంద్రబాబు తన సొంత కులానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తాడు అనే విషయం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగితే.జగన్ అనుకున్న వ్యూహం నూటికి నూరు శాతం సక్సెస్ అయినట్టే అంటున్నారు వైసీపీ నేతలు.ఇంతకీ జగన్ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి.
అంటే.తాజాగా టీడీపీ నుంచీ వైసీపీలోకి వచ్చిన నేతలతో బాబు పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయించడమే.
ఈ క్రమంలోనే ఆమంచి చంద్రబాబు పై చేస్తున్న వ్యాఖ్యలు కేవలం కుల ఆధారిత వ్యాఖ్యలుగానే ఉంటున్నాయి.
ఆమంచి మాట్లాడే ప్రతీ విషయంలో కుల ప్రస్తావన తీసుకువస్తున్నారు.
చంద్రబాబు టార్గెట్ గా చేస్తూ బాబు చుట్టూ ఉండే కీలక అధికారులు , సలహా దారులు ఇలా మొత్తం కోటరీ అంతా తమ కులస్తులతో నిండిపోయిందని, సీఎంఓ మొదలు అన్ని కీలక విభాగాలలో తన సామాజిక వర్గం వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బాబు పై విమర్శలు చేశారు.బాబు చుట్టూ తన కులాన్ని మొహరించి రాష్ట్రాన్ని కబళిస్తున్నారని అన్నారు.
త్వరలో మరిన్ని సీఎం కుల పిచ్చి వ్యవహారాలూ బయట పెడుతానని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
అయితే ఈ కుల ప్రస్తావన ఆమంచి టార్గెట్ చేస్తూ మాట్లాడటం జగన్ వ్యూహంలో భాగమేనని అంటున్నారు.ఎందుకంటే.ఏపీలో వైసీపీ కి కాపుల మద్దతు అనేది కొద్దో గొప్పో ఉండేది.
అయితే పవన్ ఎంట్రీ ఇచ్చాకా ఆ కాస్త కూడా ఉంటుందా అనేది డౌటే , ఈ సమయంలో బీసీలతో పాటు గా , కాపులని సైతం తనవైపుకి తిప్పుకోవాలంటే తప్పకుండా బాబు కి తన సొంత కులం కార్డు మెడలో వేస్తున్నారు.అందుకే కొత్తగా పార్టీలో చేరబోయే వ్యక్తులతో ఈ కుల దాడి చేయించాలని ఫిక్స్ అయ్యారట జగన్.
మొత్తానికి బీసీలని , కాపులని బాబు కి దూరం చేయడానికి తనవైపు తిప్పుకోవడానికి జగన్ భారీ వ్యుహాన్నే అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.