ప్రేమమ్ సినిమా చూసి సాయి పల్లవికి పడిపోయిన విరాటపర్వం దర్శకుడు

ఫిదా సినిమా చూసిన ఎవరైనా అందులో భానుమతి పాత్రలో చేసిన సాయి పల్లవి నటనకి ఫిదా కాకుండా ఉండరు.అందులో హీరో వరుణ్ తేజ్ అయిన కూడా ఎక్కువ క్రెడిట్, గుర్తింపు మాత్రం సాయి పల్లవికి వచ్చిందనే చెప్పాలి.

 Director Venu Udugula, Sai Pallavi Acting, Tollywood, Telugu Cinema, South Cinem-TeluguStop.com

భానుమతి పాత్రలో ఇంకా వేరే హీరోయిన్ ఎవరు చేసిన అంత ఫీల్ వచ్చి ఉండేది కాదేమో అన్నంతగా సాయిపల్లవి తన నటనతో మెస్మరైజ్ చేసింది.ఈ సినిమా కంటే ముందే టాలీవుడ్ దర్శకులు ఆమెని మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో చూసి కనెక్ట్ అయిపోయారు.

ఆ తరువాత ఆమెని తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది దర్శకులు భావించిన ఆ అవకాశం శేఖర్ కమ్ములకి దక్కింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి నీది నాది ఒకటే కథ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రైటర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా చేస్తుంది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వేణు ఊడుగుల విరాట పర్వం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి నటన నాకు బాగా నచ్చింది.ఫస్ట్ సినిమా సమయంలోనే నేను ఆమెను సంప్రదించాను.

కానీ ఆమె బిజీగా ఉండటం వలన కుదరలేదు.విరాట పర్వంలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేయగలదని నేను భావించాను.

హీరోయిన్ పాత్రను రాసుకున్నప్పుడే సాయి పల్లవిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను.దీంతో ఆమెను కలిసి కథ వినిపించాను.

వెంటనే ఇందులో నటించేందుకు సాయి పల్లవి ఒప్పుకుంది.ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది.

విరాట పర్వం’ సినిమాకు సాయి పల్లవి ప్లస్ అవుతుంది అని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube