టాలీవుడ్ మెగా హీరో వైష్ణవ తేజ్ గురించి మనందరికీ తెలిసిందే.మొదటి సినిమా ఉప్పెనతో ఉప్పెనలా దూసుకు వచ్చిన వైష్ణవ తేజ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక రెండవ సినిమా కొండ పొలం సినిమాతో ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ ని అందుకున్నాడు.ఈ కొండ పొలం సినిమాకు కూడా చాలా వరకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు.
ఇకపోతే వైష్ణవ తేజ్ ప్రస్తుతం ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అదే రంగ రంగ వైభవంగా సినిమా.
ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఎప్పటిలాగే ఈ సినిమా కథ రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను తిరస్కరించారు.
దానితో వైష్ణవ తేజ్ ఖాతాలో వరుసగా రెండవ ఫ్లాప్ సినిమా జమ అయ్యింది.దీంతో వైష్ణవ తేజ్ తన తదుపరి సినిమాపై తెలుస్తోంది.కాగా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది.
ఈ సినిమా తోనే శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడుగా కూడా పరిచయం కాబోతున్నారు.కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
అయితే మామూలుగా ప్రతి ఏడాది సంక్రాంతికి పరిధిలో భారీ సినిమాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే.ఒకవేళ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రభాస్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉంటే మాత్రం ఈ సినిమా తప్పకుండా పరాజయం పాలవుతుంది అని చెప్పవచ్చు.కాగా ఇప్పటికే వైష్ణవ తేజ్ కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అన్న విమర్శ కూడా వినిపించిన సంగతి తెలిసిందే.మరి ఈ సినిమాతో అయినా సరైన సక్సెస్ ని అందుకుంటాడో లేదో చూడాలి మరి.కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల మాత్రం స్టార్ హీరోల సరసన యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.