కరోనా సెకెండ్ వేవ్ తర్వాత భారీ చిత్రాలు తెలుగు సినిమా పరిశ్రమలో విడుదల కాలేదు.ఇప్పటి వరకు కాస్త మీడియం బడ్జెస్ సినిమాలే విడుదలై.
కొన్ని సక్సెస్ కాగా.మరికొన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.
తాజాగా పలువురు మాస్ స్టార్స్ కు చెందిన పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.వచ్చే నెలలో ఏకంగా నాలుగు భారీ సినిమాలు విడుదలకాబోతున్నాయి.
ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డిసెంబర్ తొలి వారంలోనే నందమూరి బాలయ్య సినిమా అఖండ విడుదల అవుతుంది.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు నిర్మాతలు.బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తన్న ఈ సినిమాపై జాల్లో భారీ అంచనాలున్నాయి.
బాలయ్య సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు.అటు అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదల అవుతుంది.
పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది.ఈ సినిమాపై తెలుగు సినిమా పరిశ్రమలో ఓ రేంజిలో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఈ రెండు సినిమాలతో పాటు నాని హీరోగా చేస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమా కూడా వచ్చే నెలలోనే విడుదలకు రెడీ అవుతుంది.అటు వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా కూడా క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతోంది.ఈ రెండు సినిమాలు వచ్చే నెల 24వ తేదీన విడుదల కాబోతున్నాయి.నాని సినిమా శ్యాస్ సింగ రాయ్ లో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.వారిలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఉన్నారు.అటు గని సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తుంది.
మొత్తంగా వచ్చే నెలలో నాలుగు భారీ సినిమాలు విడుదల కావడంతో సినీ లవర్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.అయితే ఈ సినిమాల్లో ఏది హిట్ అవుతుందో.? ఏది ఫట్ అవుతుందో? వేచి చూడాల్సిందే.