ఈ ఏడాది కామద ఏకాదశి( Kamada Ekadasi ) ఏప్రిల్ 19వ తేదీన జరుపుకుంటారు.సనాతన ధర్మంలో కామద ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
అలాగే కామద ఏకాదశి రోజు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు తీయకూడదు.
ఎందుకంటే దీన్ని అశుభంగా భావిస్తారు.మీరు తులసి ఆకులను ఏకాదశికి ఒక రోజు ముందు తీయవచ్చు.
ఆకులను తాజాగా ఉంచడానికి రాత్రి పూట నీటిలో ఉంచాలి.ఈ పవిత్రమైన రోజున తామసిక ఆహారం తీసుకోవడం నిషేధించబడింది.
మాంసాహారం, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి అస్సలు తినకూడదు.ఈ రోజు సిగరెట్ మరియు మద్యం అసలు సేవించకూడదు.

ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు.కామద ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి పవిత్ర స్నానం చేసి ఆచారాలను ప్రారంభించే ముందు శుభ్రమైన దుస్తులను ధరించాలి.ఈ రోజున భక్తులు మహావిష్ణువును( Lord Vishnu ) పూజిస్తారు.ఇప్పటి నుంచి ఎటువంటి పాపం చేయకూడదని సంకల్పం తీసుకుంటారు. శ్రీ యంత్రంతో పాటు విష్ణు విగ్రహాన్ని ఉంచి దేశి నెయ్యితో దీపాన్ని వెలిగించి, పువ్వులు లేదా దండ మరియు స్వీట్లు సమర్పిస్తారు.విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు పంచామృతాన్ని తులసి పత్రంతో సమర్పిస్తారు.

తులసి పత్రాన్ని( Tulasi ) సమర్పించకుండా పూజ అసంపూర్ణం అని నమ్ముతారు.భక్తులు సూర్యాస్తమయానికి ముందు సాయంత్రం పూజ చేయాలి.విష్ణువుకు భోగ్ ప్రసాదం అందించాలి.వారు విష్ణు సహస్రనామం, శ్రీహరి సోత్రం, విష్ణు ఆర్తి పఠిస్తారు.ద్వాదశి తిధి రోజు ఉపవాసం పూర్తిగా విరమించినప్పటికీ ఆకలిని భరించలేని వారు సాయంత్రం పూజ చేసిన తర్వాత భోగ్ ప్రసాదాన్ని సేవించవచ్చు.భోగ్ ప్రసాదం అంటే కేవలం పండ్లు పాల పదార్థాలు మాత్రమే.
సాయంత్రం సమయంలో హారతి చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరికీ భోగ్ ప్రసాదాన్ని పంచాలి.ప్రసాదం పంపిణీ చేసిన తర్వాత భక్తులు వారి ఉపవాసాన్ని విరమించవచ్చు.
అలాగే చాలా మంది భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు.అలాగే విష్ణువు నుంచి ఆశీర్వాదం పొందేందుకు భక్తులు తప్పనిసరిగా దేవాలయానికి వెళ్తారు.
సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి.