ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా ఒకప్పుడు ఎన్నో ఇండస్ట్రీ హిట్లను బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడున్న దిల్ రాజు లా గతంలో పేరు తెచ్చుకున్నారు అశ్వినీ దత్(Aswini Dutt).కానీ ఆయన శక్తి (Shakthi) వంటి ఇంకా మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు తీసి అవి డిజాస్టర్ అవ్వడంతో చాలా కోట్ల నష్టం వచ్చింది.
ఆ తర్వాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి మళ్ళీ వరుస సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేస్తూ దూసుకుపోతున్నారు.అశ్విని దత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న kalki 2898AD కి ప్రొడ్యూసర్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ మధ్యకాలంలో ఆయన యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.
చూడాలని ఉంది సినిమా( Chudalani Undi Movie ) హిట్ అవుతుందని చిరంజీవి (Chiranjeevi) ముందుగానే చెప్పారు.అలాగే ఇంద్ర సినిమా టైంలో ఏకంగా పోలీస్ కమిషనర్ చిరంజీవి గారికి ఫోన్ చేసి మీ అభిమానులను కాస్త మాకు కోపరేట్ చేయమని చెప్పండి.
వారి రచ్చ మేము తట్టుకోలేకపోతున్నామని అన్నారు.
![Telugu Aswini Dutt, Chiranjeevi, Chudalani Undi, Indra, Jagadekaveeru, Kalki, Pr Telugu Aswini Dutt, Chiranjeevi, Chudalani Undi, Indra, Jagadekaveeru, Kalki, Pr](https://telugustop.com/wp-content/uploads/2023/08/producer-Aswini-Dutt-sensational-comments-on-heroine-sameera-reddy-detailsa.jpg)
అలాగే చిరంజీవితో కలిసి వరుసగా చూడాలని ఉంది, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర(Indra) వంటి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇక ఆ తర్వాత మా కాంబినేషన్లో వచ్చిన జై చిరంజీవ(Jai Chiranjeeva) సినిమా మీద కూడా అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అట్టర్ ప్లాఫ్ అయ్యింది.
ఇక హీరోయిన్ సమీరా రెడ్డి ఓ ఐరన్ లెగ్.సమీరా రెడ్డిని త్రివిక్రమ్ చెబితే అందులో తీసుకున్నా.
![Telugu Aswini Dutt, Chiranjeevi, Chudalani Undi, Indra, Jagadekaveeru, Kalki, Pr Telugu Aswini Dutt, Chiranjeevi, Chudalani Undi, Indra, Jagadekaveeru, Kalki, Pr](https://telugustop.com/wp-content/uploads/2023/08/producer-Aswini-Dutt-sensational-comments-on-heroine-sameera-reddy-detailsd.jpg)
అలాగే అందులో సన్నివేశాలు అన్నీ ఆమెను ఉద్దేశించే రాశాను.కానీ అందులో ఏ ఒక్కటి కూడా బాగారాలేదు.ఎంతో మంచి మంచి సీన్లు ఒక్కటి కూడా సరిగ్గా రాలేదు.అంటూ అశ్వినీ దత్ హీరోయిన్ సమీరా రెడ్డి (Sameera Reddy) పై సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.