బాబు కాన్వాయ్ పైకి చెప్పులు అమరావతిలో ఉద్రిక్తత

టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రాజధాని అమరావతి యాత్ర ఉద్రిక్తంగా మారింది.రాజధాని నిర్మాణం తన హయం లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు బాబు సిద్ధం అయ్యాడు.

 Tention In Chandrababu Naidu Amaravathi Tour-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి యాత్రకు శ్రీకారం చుట్టాడు.ఉండవల్లిలోని తన నివాసం నుంచి టిడిపి నేతలతో కలిసి బయలుదేరారు.

దారివెంటా టిడిపి శ్రేణులు స్థానికులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.ఎన్నికల తర్వాత తొలి సారి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు.

రాజధాని ప్రాంత రైతులతో ఆయన అన్ని విషయాలను చర్చించేందుకు సిద్ధం అవుతున్నారు.అలాగే రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలనూ చంద్రబాబు పరిశీలించనున్నారు.

అయితే అమరావతిలో దీనిపై హైటెన్షన్ మొదలయ్యింది.చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు.

నల్లబాడ్జీలు ధరించి చంద్రబాబు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనేక చోట్ల చంద్రబాబు కాన్వాయ్ పైకి రాళ్లు, చెప్పు లు విసిరారు.

అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు.వెంకటాయపాలెం దగ్గర పలువురు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

దీని పై టిడిపి కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసారు.నినాదాలు చేయవద్దంటూ హెచ్చరించారు.

అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube