టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రెండు సంవత్సరాల పాటు వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఈ మధ్య కాస్త వెలుగు తప్పినట్లు అనిపించింది.ఇటీవలే ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమా లో ఆమె నటన కు విమర్శకుల ప్రశంసలు సొంతం అయినా కూడా.ఆ సినిమా కమర్షియల్గా నిరాశ పరచడం తో ఆమె కెరియర్ దెబ్బ పడినట్లు అయింది.
ఇక తమిళం లో ఈ అమ్మడు సూపర్ స్టార్ విజయ్ కి జోడి సినిమాలో నటించింది.తాజాగా భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా కు నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యం లో తమిళం లో భారీ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న పూజా హెగ్డే నిరాశ తప్పలేదు.
దాదాపుగా పది సంవత్సరాల క్రితం తమిళం లో తన మొదటి సినిమా ని పూజా హెగ్డే చేసిన విషయం తెలిసిందే.
ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం తో మళ్లీ అటు వైపు వెళ్ళ లేదు.దశాబ్ద కాలం తర్వాత తమిళం లో నటించిన పూజా హెగ్డే తీవ్ర నిరాశ ఎదురైంది.
తమిళం లో పూర్వ వైభవాన్ని సాధించడం కోసం ప్రయత్నించిన పూజ ప్రారంభంలోనే తీవ్రమైన దెబ్బ తగలడం తో అక్కడ మళ్లీ ఆఫర్లు వస్తాయని నమ్మకం లేదంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు లో ఇప్పటికే ఆఫర్లు తగ్గాయి.
హిందీ లో మొదటి నుండి కూడా ఈ అమ్మడిని పట్టించుకున్న దాఖలాలు లేవు.అందుకే తమిళం మరియు హిందీ ఫిల్మ్ మేకర్లు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
తెలుగు లో ఆఫర్లు వస్తున్నాయి.కాని తెలుగులో వరుసగా ఫ్లాప్ అయితే మాత్రం కచ్చితంగా ముందు ముందు ఈమె కు గడ్డు పరిస్థితులు తప్పవు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెండు మూడు సంవత్సరాల్లో కనీసం రెండు మూడు సక్సెస్ లు అయినా ఆమె ఖాతాలో పడాల్సి ఉంది.అందుకు తగ్గట్లుగా సినిమాల ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు, పూజా హెగ్డే సినిమాల ఎంపిక ఎలా ఉంటుంది అనేది చూడాలి.