టీం ఇండియా ఆటగాళ్లకు సెకండ్ డోస్ అక్కడే..!

కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీ స్థాయిలో జరగాల్సిన ఐపిఎల్ 14వ సీజన్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.ఇక త్వరలో టీం ఇండియా న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది.

 Team India Cricketers Second Dose Vaccine Arranged In England , Team India Crick-TeluguStop.com

అయితే ఇటీవలే టీం ఇండియా క్రికెటర్లకు ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ అందించారు.రెండో డోస్ కు ఇంకాస్త టైం ఉంది అందుకే బీసీసీఐ వారికి సెకండ్ డోస్ ను ఇంగ్లండ్ లోనే ఇప్పించే ఏర్పాట్లు చేస్తుంది.

యూకె ఆరోగ్య శాఖ కూడా ఇందుకు ఓకే చెప్పడంతో టీం ఇండియా ఆటగాళ్లకు ఇంగ్లండ్ లో కరోనా సెకండ్ డోస్ టీకా వేస్తారని తెలుస్తుంది.ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జూన్ 18 నుండి ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ లో జరుగనుంది.

కరోనా కారణంగా ముందుగానే ఇరు జట్ల సభ్యులు క్వారెంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా జరిగినట్టు చెబుతున్నారు.

ఇదే కాకుండా భారత మహిళ క్రికెట్ జట్టు కూడా ఇంగ్లండ్ లో పర్యటించనుంది.స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ మహిళలు, పురుషుల జట్లకు స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube