కేంద్రమంత్రి అమేథి ఎంపీ స్మృతి ఇరానీ ఇటీవల ప్రధాని మోడీ నియోజకవర్గం అయినా వారణాసి లో పర్యటించారు.ఈ సందర్భంగా అక్కడ సాధారణ వ్యక్తి మాదిరిగా వీధిలో పానీపూరి టేస్ట్ చేశారు.
కేంద్ర మంత్రి రావటంతో మీడియా హడావిడి ఉండటంతో .ఆమె తిన్న తర్వాత మీడియా ప్రతినిధులు పానీపూరీలు ఎలా ఉన్నాయి అని సరదా ప్రశ్నలు వేశారు.
దానికి ఆమె సమాధానమిస్తూ హరహర మహాదేవ్ అంటూ అక్కడనుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.రోడ్డుపై అది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కావటం తో చాలామంది పలువురు సామాన్యులు ఆమెతో సెల్ఫీ ఫోటోలు దిగటానికి ఆసక్తి చూపారు.
ఇటీవల వారణాసిలో బిజెపి పార్టీకి సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సమావేశాలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంకా పలువురు నేతలు హాజరు కాగా తాజాగా నిన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరవడం జరిగింది.