యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక జాను ఫెయిల్యూర్ తరువాత శర్వానంద్ నటిస్తున్న సినిమా కావడంతో శ్రీకారం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అటు సినీ వర్గా్ల్లోనూ నెలకొంది. కాగా ఈ సినిమాను కొత్త దర్శకుడు కిశోర్ రెడ్డి పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాను మార్చి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.అయితే ఈ సినిమా టీజర్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా, టీజర్ను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇప్పటికే ఈ టీజర్ను కట్ చేశారని, త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు కిషోర్ రెడ్డి తెలిపారు.ఇక మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఈ సినిమాలో శర్వానంద్ సరసన అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది.శివరాత్రి కానుకగా రిలీజ్ అవుతున్న శ్రీకారం టీజర్ను చిత్ర యూనిట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, రిలీజ్ తరువాత ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.