ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక నగరాల్లో అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతోంది.ముఖ్యంగా హైదరాబాద్ లో ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఇలా ఒక్కటేమిటి రకరకాల అద్భుతాలను సృష్టిస్తూ రోజురోజుకు హైదరాబాద్ బ్రాండ్ రోజురోజుకు విస్తరిస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ లో రకరకాల అద్భుతమైన టెక్నాలజీతో నిర్మాణాలను జరుపుకుంటూ అతి పెద్ద టూరిస్ట్ హబ్ మారిపోయిన హైదరాబాద్ లో త్వరలో మరో అద్భుతమైన వినూత్నమైన ట్రాన్స్ పోర్ట్ సదుపాయం అందుబాటులోకి రానుంది.
అది మరేదో కాదు రోప్ వే ట్రాన్స్ పోర్ట్.
ఇప్పటికే ఈ తరహా ట్రాన్స్ పోర్ట్ ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితులలో హైదరాబాద్ లో కూడా ఈ రోప్ వే ట్రాన్స్ పోర్ట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకరావాలని యూనిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రయత్నిస్తోంది.రోప్ వే ట్రాన్స్ పోర్ట్ అంటే రోప్స్ ను రెండు ప్రదేశాలకు కనెక్ట్ చేసి, ప్రయాణించడానికి ఉపయోగించే క్యాబిన్స్ ను ఈ రోప్స్ కు హ్యాంగ్ చేస్తారు.
ఇలా రోప్ కు హ్యాంగ్ అయిపోయి ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్తుంటాయి.ఈ ట్రాన్స్ పోర్ట్ సదుపాయం చాలా ఆసక్తిగా ఉంది కదా.అయితే ఈ సదుపాయాన్ని ముందుగా ఎక్కువగా పర్యాటకులు జూ పార్క్ కు వెళ్లే విధంగా ఎంజీబీఎస్ నుండి జూ పార్క్ కు, ఖైరతాబాద్ నుండి సచివాలయానికి, అయితే యాదాద్రికి కూడా భక్తులు, పర్యాటకులు క్యూ కడుతుండడంతో రోప్ వే ట్రాన్స్ పోర్ట్ సదుపాయం యాదాద్రిలో ఎంతవరకు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.